తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండల ఎంపీడీవోగా ఎం చెన్నయ్య నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఇక్కడ ఎంపీడీవో గా, కొనసాగుతున్న పివీఎస్ నాగేశ్వరరావు చెన్నయ్య కు చార్జి అప్పగించారు. చెన్నయ్య ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో విధులు నిర్వహిస్తూ, పరిపాలన చర్యల్లో భాగంగా, గంపలగూడెం వచ్చినట్లు చెప్పారు.