వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం 4వ రోజు తిరువూరు మండలంలోని చింతలపాడు, రోలుపడి, ఎరుకోపాడు, ముష్టి కుంట్ల, మునికుళ్ళ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్ర జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, అద్యక్షుడు వి. నాగరాజు, ఉపాధ్యక్షుడు పానెం. ఆనందరావు పాల్గొన్నారు.