గంపలగూడెం మండలంలో పెనుగొలను లో ఆదివారం గ్రామ టిడిపి పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. నందిగామకు చెందిన కొడాలి క్రాంతి బాబు మెమోరియల్ ఆరోగ్య సిబ్బంది శిబిరానికి వచ్చిన 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. సహకార సంఘ మాజీ అధ్యక్షులు నంబూరు శ్రీనివాసరావు, మండల టిడిపి నాయకులు నాగళ్ళ మురళీ, గ్రామ టిడిపి అధ్యక్షులు తోట హరిబాబు, కోరంపల్లి లక్ష్మణరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.