గంపలగూడెం మండలం పెనుగొలను 99వ అంగన్వాడి కేంద్రంలో గురువారం పౌష్టికారాహార పక్షోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భిణీలు వినియోగించుకోవాలని ఐసీడీఎస్ కార్యకర్తలు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి. నరసింహారావు, అంగన్వాడీ కార్యకర్తలు కె లింగమ్మ, పివీ. సాయి లక్ష్మి, యం. స్వరూప రాణి, బి. నాగమణి, డి. దివ్య ఉన్నారు.