గంపలగూడెం: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి

58చూసినవారు
గంపలగూడెం: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మండల విద్యాధికారి పివి. డి. ఎల్. నరసింహారావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన గంపలగూడెం మండలం దుందిరాలపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నవోదయ సీట్ సాధించిన మోదుగు నిత్య నూతనను ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బాబురావు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్