తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి చిత్రపటం మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు.