గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తించిన ప్రధానోపాధ్యాయుడు ఏవీ. నరసింహారావు తునికిపాడు పాఠశాలకు బదిలీ కాగా, శనివారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద శాలువా కప్పి, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు ఆయన సేవలను ప్రశంసించారు.