గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంటరానితనం, మహిళా హక్కుల కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన పూలే గొప్ప మానవతావాదని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ రామాల నాగేశ్వరావు తెలిపారు.