తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు శనివారం తిరువూరు నియోజకవర్గ పరిధిలోగల ఏ కొండూరు మండలం కృష్ణారావు పాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు చదువు, మెనూ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఏ కొండూరు గిరిజన ప్రభుత్వ సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సందర్శించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు.