మైలవరం: తొలి పెన్షన్ల పంపిణీ పై దృష్టి పెట్టండి
By D.Nataraju 76చూసినవారుడిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందురోజే నవంబర్ 30న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ డీఆర్డీఏ పీడీ, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్ లు,ఎంపీడీవోలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.