విస్సన్నపేట మండల పరిధిలోని వీరరాఘపురంలోని గాజుల చెరువులో అక్రమ మట్టి తోలకాలను గురువారం రెవెన్యూ సిబ్బంది, స్థానికుల సమాచారంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జెసీబీ స్వాధీనం చేసుకున్నారు. గమనించిన ట్రాక్టర్లు పారిపోయినట్లు వారు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా మట్టి తోలకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ లక్ష్మీ కళ్యాణి హెచ్చరించారు.