గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ బైయిలీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చూపు లేని వారు విద్యను అభ్యసించడం కోసం లిపిని కనిపెట్టి అంధుల కళ్లల్లో వెలుగులు నింపిన లూయిస్ బ్రెయిలీ మహానీయుడని టీచర్ కె. లింగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి పెట్టారు.