ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల శాఖా గ్రంథాలయానికి ఆ గ్రామ హైస్కూల్ హెచ్ఎం పెనుకొండ భువనేశ్వరరావు రూ. 4, 400 విలువ గల రెండు సీలింగ్ ఫాన్స్ను బహూకరించారు. గురువారం లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు డీఎన్బీ అమరనాథ్ను హెచ్ఎం భువనేశ్వరరావు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రభాకరరావు, కిషోర్, ప్రసాద్ పాల్గొన్నారు.