భీమడోలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా శేషపు శేషగిరి నియమితులయ్యారు. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన 30 ఏఎంసీ ఛైర్మన్ల నామినేటెడ్ పదవుల జాబితాలో శేషగిరిని భీమడోలు ఏఎంసి చైర్మన్ గా ఎంపిక చేశారు. బీసీ జనరల్ కోటా కింద ఈయన్ను ఈపదవి వరించింది. తెదేపాకు చెందిన శేషగిరి భీమడోలు ఎంపీటీసీగా గతంలో పనిచేశారు. పార్టీలో నమ్మకస్థుడైన శేషగిరికి చైర్మన్ పదవి వరించడం పట్ల తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.