ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నట్లు శనివారం ఆస్ఐఓ ప్రభాకరరావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం సుమారు 34,564 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు వీలుగా ఆయా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.