విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బుధవారం బహూకరించారు. తొలుత పట్టు చీరను అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి పూజ చేశారు. అనంతరం ఈవో శీనానాయక్కు అందజేశారు.