విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం గణేష్ అనే వ్యక్తిని బ్లేడ్ బ్యాచ్ వాళ్లు డబ్బులు అడగగా.. గణేష్ నిరాకరించడంతో బ్లేడ్తో దాడి చేశారు. ఇంకా మరో వ్యక్తిపై కర్రలతో దాడిపడ్డారు. తీవ్రంగా గాయపడిన గణేష్ను.. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.