ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. శుక్రవారం క్యాంప్ ఆఫీస్లో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో సమావేశమైన వైయస్ జగన్, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారితో మాట్లాడారు. అనంతరం బొత్స సత్యనారాయణను ఖరారు చేశారు.