నేటి బాలలే భావి భారత సారథులు, అలాంటి బాలల హక్కుల సంరక్షణలో గత రెండేళ్లలో విశేష కృషి చేసి ఎన్టీఆర్ జిల్లాను అత్యుత్తమ ప్రగతి సాధించిన జిల్లాగా నిలిపినందుకు కలెక్టర్ ఎస్. డిల్లీరావుకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.