లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ వారి ఇళ్లవద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాన్ని అందించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. సృజన, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన్ పాల్గొన్నారు. విజయవాడ యనమలకుదురు రోడ్డు, కృష్ణానగర్లో గురువారం జరిగిన పెన్షన్లపంపిణీ కార్యక్రమంలో భాగస్వాములై లబ్ధిదారులను స్వయంగా కలిసి పెన్షన్ మొత్తాన్ని అందించారు.