విజయవాడ కాళేశ్వర మార్కెట్ సెంటర్ వద్ద ఆపరేషన్ సింధూర్ లో భాగంగా యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.