వైసీపీ ప్రభుత్వం తమ గుండాలతో టీడీపీ కార్యకర్తలపై అన్యాయంగా దాడులు చేయించడమేకాక వారిపై అక్రమ కేసులు కూడా బనాయించి మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ గుర్తు చేశారు. సోమవారం ఆయన పటమటలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా అక్రమ కేసుల నుండి కార్యకర్తలు విముక్తి పొందేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కార్యకర్తలకు ఉపసమనాన్ని కలిగించిందని తెలిపారు.