ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసిన తర్వాత, మరో నలుగురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వీరిలో వైసీపీ అధినేత జగన్కు ఓఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ పనిచేసిన కృష్ణమోహన్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, ధనుంజయ్, రోహిత్ రెడ్డి ఉన్నారు. ఈ నోటీసుల్లో వారు విజయవాడలోని సిట్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.