తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం అయోధ్య నగర్ లో నివాసితులు బత్తుల రవికుమార్, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీసాయి చరణ్, చక్వాణయజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతీరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేశారు. ఈ వాహనాన్ని జండా ఊపి ప్రారంభించారు.