పచ్చదనానికి ప్రాధాన్యతానిచ్చి చెట్లను పెంచడం ద్వారా ఎండ వేడిమిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ‘బీట్ ద హీట్’’నినాదంతో స్వచ్ఛత కార్యక్రమానికి భూ పరిపాలన చీఫ్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి స్టాల్స్ను పరిశీలించారు.