సూర్యారాధన వల్ల మనో వికాసం కలుగుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం రథసప్తమిని పురస్కరించుకొని మంగళవారం బుడమేరు వంతెన వద్దనున్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త జగతికీ మూలాధారం. కాలానికి అధిపతి అయిన సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.