విజయవాడ నగరం, దిగువ ప్రాంతాలకు పెను విషాదానికి కారణమైన బుడమేరుపై యుద్దప్రాతిపదిక పనులు చేపట్టాలని నిరసనలు వెలువెత్తాయి. విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద సీపీఐ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి దోనేపూడి అధ్యక్షతన బుడమేర ప్రక్షాలన చేయాలని, ఆక్రమణ తొలగించాలని భారీ నిరసన దీక్షను చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.