విజయవాడ: ప్రజా సేవ పట్ల మీ నిబద్ధతకు లభించిన గుర్తింపు: గల్లా

50చూసినవారు
విజయవాడ:  ప్రజా సేవ పట్ల మీ నిబద్ధతకు లభించిన గుర్తింపు: గల్లా
కేంద్ర మంత్రికి హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రముఖ వ్యాపార వేత్త గల్లా జయదేవ్ మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడును అభినందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ 2025గా ఎంపికైనందుకు ఆయనను గల్లా అభినందించారు. ఇది మీ అంకితభావం, దార్శనికతకు, ప్రజా సేవ పట్ల నిబద్ధతకు లభించిన గుర్తింపు అన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని, మీ పట్ల గర్వంగా ఉందంటూ గురువారం ట్విట్ చేశారు.

సంబంధిత పోస్ట్