ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గెజిట్ను ఏపీ న్యాయశాఖ జారీ చేసింది. వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కు సంబంధించి ఆర్డినెన్స్ ఏపీ ప్రభుత్వం జారీ చేయడంతో అమలులోకి రానుంది. గవర్నర్ ఆమోదం అనంతరం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గెజిట్ న్యాయశాఖ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ జారీకి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులను గురువారం విడుదల చేశారు.