భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల వేతానాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా రూ.2,17,000 జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేసినట్లు రిసిప్ట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు.