విజయవాడ: బస్సులో మంటల ఘటనలో అప్ డేట్

60చూసినవారు
విజయవాడ కృష్ణలంకలో గురువారం సాయంత్రం ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన అంశం తెలిసిందే. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు మంటలను అదుపు చేశామన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుపుతామన్నారు.

సంబంధిత పోస్ట్