విజయవాడ: సిట్ విచారణకు హాజరుకాని విజయసాయి రెడ్డి

70చూసినవారు
విజయవాడ: సిట్ విచారణకు హాజరుకాని విజయసాయి రెడ్డి
మద్యం కుంభకోణం కేసులో గురువారం సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. పలు కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఈ నెల 18న విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్