మద్యం కుంభకోణం కేసులో గురువారం సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. పలు కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఈ నెల 18న విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారి చేసిన విషయం తెలిసిందే.