సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే పేరుతో కొత్తరకం దోపిడీ మొదలుపెట్టారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ గురువారం ఆరోపించారు. ప్రతి యూనిట్ కి రూ.40 పైసలు చొప్పున పెంచి, రూ. 4 వేల కోట్లు వసూలు చేస్తున్నారని. వైఎస్ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారన్నారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారని విమర్శించారు. విద్యుత్ వాడుకునేది తక్కువని, బిల్లుల మోత ఎక్కువన్నారు. అదనపు ఛార్జీలపై వైసీపీ పోరాటం చేస్తుందన్నారు.