గంపలగూడెం మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి బాధితులు సమస్యలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. మాకున్న సమస్యలను మీరే తీర్చాలంటూ వినతి పత్రాలు అందజేస్తున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులను పిలిచి ప్రజా సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు.