దేశ, విదేశాలకు బుద్ధుని జ్ఞాన బిక్ష పెట్టిన గ్రామం ఘంటసాల అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఘంటసాల మాట్లాడుతూ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12న బుద్ధ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా మంత్రులు కూడా విచ్చేస్తారని తెలిపారు. బుద్ధుని చరిత్రపై సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.