వీర్లపాడు మండలం జమ్మవరం గ్రామంలో వికసి పంచాయతీలో క్రీడాకారులు, క్రీడల అభివృద్ధి కోసం కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రీడా పోటీలను మండల పార్టీ అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ ప్రారంభించారు. యువకులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చూపాలని ఆయన కోరారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.10,116 ద్వితీయ బహుమతి రూ.7,116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు.