నగరపాలక సంస్థ ప్రత్యేక కమిటీల సమావేశం

67చూసినవారు
నగరపాలక సంస్థ ప్రత్యేక కమిటీల సమావేశం
నగరపాలక సంస్థ ప్రత్యేక కమిటీల సభ్యుల సమావేశం విజయవాడ లోని నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం జరిగింది. నగరంలోని 62, 27, 43, 47 డివిజన్ల పరిధిలోని రహదారులకు పలువురి పేర్లను పెడుతూ తీర్మానించారు. అలాగే 43వ డివిజన్ పోలీసు కాలనీలో ఉన్న ఉద్యానవనానికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వాంబేకాలనీలో రైల్వే ట్రాక్ సమీపంలోని రహదారికి వీధి దీపాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కమిటీ సభ్యుల ఆమోదం లభించింది.

సంబంధిత పోస్ట్