విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఈఓగా శీనా నాయక్ గురువారం బాధ్య తలు స్వీకరించారు. దేవస్థానానికి చెందిన ఐదవ అంతస్తులోని ఈఓ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. తన మీద నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని శీనా నాయక్ తెలిపారు. భక్తులకు అమ్మవారి దర్శనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు.