మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ తో పాటు రాయనపాడు పైడూరుపాడులో మంగవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై సమీక్షతో పాటు, ధాన్యం కొనుగోలు విషయములో అవకతవకలు జరుగుతున్నాయని తనిఖీలు నిర్వహించారు. ఆయన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను స్వయంగా పరిశీలించారు.