భారత్పై పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. వీరజవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గొల్లపూడి కార్యాలయంలో నాయక్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.