వీరులపాడు మండలం జగన్నాధపురం వద్ద కంకర లారీల వలన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం నాడు రోడ్డుపై కంకర్ ఉండడం వల్ల బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై కంకర వలన వాహనదారులు క్రింద పడి గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్థానికులు అన్నారు. అధిక లోడ్ తో వెళ్తున్న లారీలను ఆర్టీవో పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.