మీడియా ప్రతినిధులు నిర్వహించే క్రికెట్ టోర్నీ కప్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. మీడియాలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 10 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి.