ప్రైవేటు వ్యక్తుల వద్ద అనధికారికంగా చిట్టీలు వేసి నగర ప్రజలు మోసపోవద్దని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ వద్ద మోసపోయిన బాధితులు మాట్లాడారు. గోల్డ్ స్కీమ్ పేరుతో తమను మోసం చేశాడని చెప్పారు. అనధికారికంగా నగదు చిట్టీలు కూడా కట్టించుకున్నాడని వాపోయారు.