ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్దనున్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆలయ ఈవో వి. కె. శీనా నాయక్ సోమవారం మీడియాకు తెలిపారు. జేష్ట పౌర్ణమి సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఉదయం 05. 55 గంటలకు ప్రారంభం కానుందన్నారు. కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు జరుగుతుందన్నారు.