మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానం ద్వారా ఒత్తిడినిక తట్టుకుని రక్తపోటుని నివారించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రక్తపోటు శిభిరాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించి రక్తపోటు పరీక్షలను చేయించుకున్నారు.