2025 జనవరిలో మూడు రోజులపాటు9, 10, 11తేదీలలో) జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావుకు శనివారం ఉర్సు మహోత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ కొండపల్లి దర్గా ఉరుసు మహోత్సవాలకు ప్రతి సంవత్సరం హాజరయ్యానని అన్నారు.