సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెందిన బిల్లుల బకాయిలు రూ. 6,700 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శనివారం ఉండవల్లిలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.