జగన్ మోహన్ రెడ్డి అనే దుష్టశక్తిని ఒకసారి భూమిలో పాతిపెడితే సరిపోదని, అతనికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎం. వి. ఆర్ కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల ప్రత్యేక ఆత్మీయ సమావేశం మంగళవారం నిర్వహించారు.