నగర వాసులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సజావుగా రహదారులపై ప్రయాణించేలా ఆలోచన చేస్తున్నాము అని, ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారని కేశినేని శివనాథ్ అన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గంలో 8వ డివిజన్ లోని జమ్మిచెట్టు సెంటర్ సమీపంలో ఉన్న కెనరా బ్యాంక్ రోడ్డుతో పాటుగా మరో రెండు రోడ్లకు సుమారు రూ. 40 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు.