ఉపాధి హామీ పనులను పరిశీలించిన వైసీపీ నాయకులు

53చూసినవారు
ఉపాధి హామీ పనులను పరిశీలించిన వైసీపీ నాయకులు
తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులను నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం అందజేస్తున్న పనిదినాలపై కూలీలను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు.
గత ప్రభుత్వం 10 కోట్ల 70 లక్షల పని దినాలు కల్పిస్తే.. ఈ ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించిందన్నారు. ఉపాధి హామీని సక్రమంగా అమలు చేయాలని, వారానికి 6 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్